Kedarnath Temple: కేదార్‌నాథ్ యాత్రకు వెళ్తున్నారా.. ఖచ్చితంగా ఇవి తెలుసుకోండి!

Kedarnath Temple: Are you planning pilgrimage to Kedarnath? Here is what you need to know!

Kedarnath Temple: Are you planning pilgrimage to Kedarnath? Here is what you need to know!

Kedarnath Temple: శివభక్తులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చింది. శీతాకాల విరామం అనంతరం ఉత్తరాఖండ్‌లోని పవిత్ర క్షేత్రం కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు ఈరోజు (ఏప్రిల్ 22, 2026, బుధవారం) ఉదయం తిరిగి తెరుచుకున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ ఆలయం మంచు పర్వతాల నడుమ ఉండటంతో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగిస్తుంది. ఆలయం తెరుచుకోవడంతో భక్తులతో ప్రాంతం సందడిగా మారింది. ఈసారి గతేడాదికంటే ఎక్కువ మంది యాత్రికులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆలయంలో వైభవంగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం సరిగ్గా 8 గంటలకు శుభ ముహూర్తంలో వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రధాన ద్వారాలు తెరిచారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం అంతా ‘హర హర మహాదేవ’, ‘జై బాబా కేదార్’ నినాదాలతో మార్మోగింది. ప్రత్యేకంగా ఈ వేడుక కోసం ఆలయాన్ని సుమారు 10 క్వింటాళ్ల రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు.

కేదార్‌నాథ్ యాత్రలో ఉఖీమఠంతో ఉన్న సంబంధం ఎంతో ముఖ్యమైనది. శీతాకాలంలో భారీగా మంచు పడటం వల్ల ఆలయాన్ని మూసివేస్తారు. ఆ సమయంలో బాబా కేదార్‌నాథ్ ఉత్సవ విగ్రహాన్ని ఉఖీమఠంలోని ఓంకారేశ్వర ఆలయానికి తరలిస్తారు. ఆరు నెలల పాటు అక్కడే పూజలు జరుగుతాయి. ఈసారి కూడా మంగళవారం సాయంత్రం డోలి రూపంలో తిరిగి కేదార్‌నాథ్‌కు చేరుకున్నారు. ఈ డోలి యాత్ర భక్తి భావంతో సాగుతూ, ఒక పండుగలా నిర్వహించబడుతుంది.

కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులు భైరవనాథుడిని ముందుగా దర్శించుకోవడం ఒక సంప్రదాయం. కొండపై ఉన్న భైరవనాథ ఆలయం క్షేత్రపాలకుడిగా భావిస్తారు. శీతాకాలంలో ఆలయం మూసివున్న సమయంలో ఈ ప్రాంతాన్ని ఆయనే కాపాడుతారని భక్తుల నమ్మకం. అందుకే భైరవనాథుడి దర్శనం లేకుండా కేదార్‌నాథ్ యాత్ర పూర్తి కాలేదని పురాణాలు చెబుతున్నాయి.

ఆలయ ద్వారాలు ఈరోజు తెరుచుకున్నప్పటికీ, మొదటి మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు మాత్రమే జరుగుతాయి. సాధారణ నిత్య పూజలు, భోగ నివేదనలు ఏప్రిల్ 25 నుంచి ప్రారంభమవుతాయి. అప్పటి వరకు భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కొనసాగుతాయి.

ఇక చార్ ధామ్ యాత్రలో మరో ముఖ్యమైన ఘట్టం కూడా దగ్గరపడింది. రేపు, అంటే ఏప్రిల్ 23 ఉదయం 6:15 గంటలకు బద్రీనాథ్ ఆలయ ద్వారాలు కూడా తెరుచుకోనున్నాయి. భూలోక వైకుంఠంగా పేరుగాంచిన ఈ క్షేత్రం దర్శనం కోసం కూడా ఇప్పటికే భారీగా భక్తులు చేరుకుంటున్నారు.

Also Read: Lifestyle: నీటిలో నిమ్మరసం, ఉప్పు, తేనె కలిపి తాగితే..

Kedarnath Temple: కేదార్‌నాథ్ యాత్రకు వెళ్తున్నారా.. ఖచ్చితంగా ఇవి తెలుసుకోండి!