Half Day Schools: ఇక నుంచి 11 గం. వరకే ఒంటిపూట బడులు..!

mspta suggests Revises School Timings Due To heat waves

mspta suggests Revises School Timings Due To heat waves

Half Day Schools: రోజురోజుకీ ఎండ తీవ్రత పెరుగుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, వడగాల్పులు కూడా ఎక్కువగా వీస్తున్నాయి. ఉదయం 8 గంటల తర్వాత బయటకు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా ఎండ పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు కూడా వెలువడుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మార్చి 16 నుంచి ఈ విధానం అమల్లో ఉంది. ప్రతిరోజూ ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు క్లాసులు కొనసాగిస్తున్నాయి.

అయితే, పాఠశాలలు ముగిసే సమయానికి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏపీలో 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పిల్లలు వేడిని తట్టుకోలేకపోతున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఒంటిపూట బడుల సమయాలను మార్చాలని ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాల నుంచి వినతులు వస్తున్నాయి. మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్, ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 11 గంటల వరకే నిర్వహించాలని కోరింది.

ఇక విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా, పాఠశాలలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూల్స్‌కు సూచనలు ఇచ్చింది. ఉదయం పాఠశాల ప్రారంభ సమయంలో రాగిజావ ఇవ్వడం, తరగతులు ముగిసిన తర్వాత మధ్యాహ్న భోజనం అందించడం తప్పనిసరి చేసింది.

ప్రస్తుతం ఈ నెల 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. ఇదే సమయంలో పలు పాఠశాలల్లో పరీక్షలు జరుగుతుండగా, రెండు రాష్ట్రాల్లో పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ కొనసాగుతోంది. తెలంగాణలో ఇప్పటికే ఇంటర్ ఫలితాలు ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 18 లేదా 19న విడుదల చేసే అవకాశం ఉంది.

మొత్తంగా, పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్ట్యా ఒంటిపూట బడుల సమయాల్లో మార్పులు చేస్తారా లేదా ప్రస్తుతం ఉన్న విధానాన్ని కొనసాగిస్తారా అన్నది ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది.

Also Read: Asha Bhosle: ఆశాభోస్లే ఎవరి పాటలు ఎక్కువగా వింటారంటే..!

Half Day Schools: ఇక నుంచి 11 గం. వరకే ఒంటిపూట బడులు..!