Crime: బెంగళూరులోని దేవనహళ్లి ప్రాంతంలో ఉన్న ఫాక్స్కాన్ ఐఫోన్ అసెంబ్లీ ఫ్యాక్టరీలో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. 19 ఏళ్ల యువతి టాయిలెట్లో ప్రసవించిన తరువాత తన నవజాత శిశువును హత్య చేసినట్లు సమాచారం.
ఎన్డిటివి నివేదిక ప్రకారం, రేణుక అనే ఈ యువతి ఫ్యాక్టరీలో ఉద్యోగిగా పనిచేస్తోంది. టాయిలెట్కు వెళ్లిన సమయంలోనే ఆమెకు అనుకోకుండా ప్రసవం జరిగినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
ప్రసవం జరిగిన వెంటనే, అవమానం భయంతో ఆమె శిశువు గొంతు కోసి చంపి, మృతదేహాన్ని ఒక సంచిలో వేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం, మరో ఉద్యోగి వాష్రూమ్కు వెళ్లినప్పుడు శిశువు మృతదేహాన్ని గుర్తించడంతో ఈ ఘటన బయటపడింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలన చేశారు. పుట్టిన వెంటనే శిశువు హత్యకు గురైనట్లు వారు భావిస్తున్నారు.
ప్రస్తుతం నిందితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
