World War 3: ఇరాన్పై ఇజ్రాయెల్ మరోసారి దాడులకు దిగిన నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. మిసైల్ దాడులతో ఇరాన్ రాజధాని తెహ్రాన్ సహా పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ నివాసానికి సమీప ప్రాంతాలు, అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్కు సంబంధించిన ప్రాంతాలు, నిఘా కార్యాలయాలు కూడా టార్గెట్ అయ్యాయని సమాచారం. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా దాడులు కొనసాగిస్తోంది. ఈ పరిణామాలతో ప్రాంతీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
ఈ యుద్ధ వాతావరణం మధ్య ప్రముఖ కాలజ్ఞాని బాబా వంగా జోస్యాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. గతంలో 9/11 దాడులు, ప్రిన్సెస్ డయానా మరణం, కోవిడ్-19 వంటి ఘటనలను ఆమె ముందుగానే ఊహించిందని కొందరు విశ్వసిస్తారు. అదే కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె చెప్పిన మరో జోస్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాబా వంగా 2026 సంవత్సరంలో ఒక పెద్ద ఘర్షణ జరుగుతుందని అంచనా వేసిందని ఆమె అనుచరులు చెబుతున్నారు. కొందరు దీనిని “మూడో ప్రపంచ యుద్ధం”గా భావిస్తున్నారు. గతంలో ఈ జోస్యాన్ని ఇతర సంఘటనలతో అనుసంధానించినా, ప్రస్తుతం ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో మళ్లీ దీనిపై చర్చ మొదలైంది. మరో ప్రపంచ యుద్ధం సంభవిస్తుందా అనే సందేహాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల జరిగిన దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పందించారు. ఇరాన్లోని ఉగ్రవాద పాలన నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు చర్యలు ప్రారంభించామని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్పై కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇరాన్తో అణు చర్చలు సంతృప్తికరంగా లేవని, ఒత్తిడి పరిస్థితులు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
ఇంతలో బాబా వంగా ఎవరు అనే ప్రశ్న కూడా మళ్లీ వినిపిస్తోంది. బాబా వంగా బల్గేరియా దేశానికి చెందిన ప్రసిద్ధ కాలజ్ఞాని. ఆమె చెప్పిన అనేక జోస్యాలు నిజమయ్యాయని అనుచరులు నమ్ముతారు. అందుకే ఆమెను “బాల్కన్ ప్రాంత నోస్ట్రాడమస్” అని కూడా పిలుస్తారు.
ప్రస్తుత పరిస్థితులు ఎలా మలుపుతిరుగుతాయో అనేది చూడాల్సి ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల మధ్య బాబా వంగా జోస్యం మరోసారి చర్చనీయాంశమైంది.
Also Read: Hiccups: ఎక్కిళ్లు ఆగకపోతే ఇలా చేయండి
World War 3: మూడో ప్రపంచ యుద్ధం తప్పదా?
