Telecom: ఇవాళ్టి నుంచి కొత్త టెలికం నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ మార్పుల ప్రకారం, వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి మెసేజింగ్ యాప్లు ఇప్పుడు ఫోన్లో ఉన్న సిమ్ కార్డ్తో తప్పనిసరిగా అనుసంధానమై ఉండాలి. అంటే, మీ మొబైల్లో రిజిస్టర్ చేసిన సిమ్ యాక్టివ్గా లేకపోతే ఈ యాప్లు సక్రమంగా పనిచేయవు.
కొత్త నిబంధనల ప్రకారం ప్రతి 6 గంటలకు ఒకసారి యాప్లు ఫోన్లో సిమ్ కార్డ్ ఉందో లేదో ఆటోమేటిక్గా తనిఖీ చేస్తాయి. ఒకవేళ సిమ్ తీసివేసినా, లేదా సిమ్ పనిచేయని స్థితిలో ఉన్నా, ఆ యాప్లు వెంటనే పనిచేయడం ఆపేస్తాయి. దీనివల్ల యూజర్ గుర్తింపును నిర్ధారించడం, భద్రతను పెంచడం ప్రధాన ఉద్దేశ్యంగా ఉందని అధికారులు చెబుతున్నారు.
అలాగే కంప్యూటర్ లేదా వెబ్ వెర్షన్ ద్వారా వాట్సాప్ వంటి యాప్లలో లాగిన్ అయ్యే వారికి కూడా కొత్త నియమాలు వర్తిస్తాయి. ఇకపై వెబ్ లేదా డెస్క్టాప్లో లాగిన్ అయిన యూజర్లు ప్రతి 6 గంటలకు ఒకసారి రీఅథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే మళ్లీ గుర్తింపు నిర్ధారణ చేయకపోతే యాప్ ఆటోమేటిక్గా లాగ్ అవుట్ అవుతుంది.
ఈ మార్పులు సైబర్ నేరాలను తగ్గించడం, ఫేక్ అకౌంట్లను నియంత్రించడం, యూజర్ల భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా తీసుకొచ్చినవిగా చెబుతున్నారు. కాబట్టి ఈ యాప్లు సజావుగా పనిచేయాలంటే ఫోన్లో సిమ్ కార్డ్ యాక్టివ్గా ఉంచడం తప్పనిసరి.
