Telangana Shocker: ‘నా మొగుడిని బయట యాక్సిడెంట్ చేయించి చంపెయ్..’ భార్య షాకింగ్ మెసేజ్!

telangana shocker: wifes message to lover

Telangana Shocker: మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న మొగుడినే చంపించాలని ఓ భార్య తన ప్రియుడికి మెసేజ్ చేసిందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

అసలు ఏం జరిగింది?

మహబూబాబాద్ కు చెందిన రాజేశ్వర్, భవానీ భార్యాభర్తలు. 2016లో వీళ్లకు పెళ్లయింది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా భవానీకి కొరియర్ బాయ్ సైదులుతో ఎఫైర్ నడుస్తోందని భర్తకు అనుమానం వచ్చింది. ఇటీవల ఇద్దరినీ కలిసి పట్టుకున్నాక, పెద్దలతో పంచాయితీ కూడా పెట్టారట.

ఆ తర్వాతే అసలు ట్విస్ట్..

భవానీ తన ప్రియుడు సైదులుకు వాట్సాప్ లో మెసేజ్ చేసిందట. అందులో – “ఇంట్లో వద్దు, బయట ఎక్కడైనా యాక్సిడెంట్ లా చూపించి నా భర్తను చంపించు. లేదంటే నేను చచ్చిపోతా” అని రాసిందని ఆ మెసేజ్ లు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఆ మెసేజ్ లు చూసిన భర్త రాజేశ్వర్ వెంటనే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు.

పోలీసులు ఏం చెబుతున్నారు?

పోలీసులు కేసు నమోదు చేసి భవానీ ఫోన్, వాట్సాప్ చాట్ లు స్వాధీనం చేసుకున్నారు. నిజంగానే ఆ మెసేజ్ లు భవానీయే పంపిందా? లేక ఎవరైనా క్రియేట్ చేశారా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. హత్యకు ప్లాన్ చేసిందా లేదా కోపంలో అలా మెసేజ్ చేసిందా అని కూడా ఆరా తీస్తున్నారు.

ఇంకా పూర్తి విచారణ జరగాల్సి ఉంది. ఈ ఘటన ఇప్పుడు మహబూబాబాద్ లో హాట్ టాపిక్ అయింది.

Also Read: Gujarat Viral Well: బావిలో కదులుతున్న నీరు.. దెయ్యమే కారణమా? వీడియో చూస్తే వణికిపోతారు!