CBSE Re-evaluation: చదువులో టాపర్ (Topper) అయినప్పటికీ బోర్డు పరీక్షల మూల్యాంకనంలో (Valuation) ఒక్కోసారి జరిగే చిన్న చిన్న తప్పులు విద్యార్థులను ఎంతటి మానసిక ఆందోళనకు గురిచేస్తాయో నిరూపించే సంఘటన ఇది. సీబీఎస్ఈ (CBSE) 12వ తరగతి ఫలితాల రీవాల్యుయేషన్లో ఓ విద్యార్థిని ఏకంగా 500కి 500 మార్కులు సాధించి దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డు సృష్టించింది.
తొలుత మార్కులు చూసి షాక్!
ఝార్ఖండ్ రాజధాని రాంచీకి చెందిన అవని కేజ్రీవాల్ అనే విద్యార్థిని సీబీఎస్ఈ 12వ తరగతి (కామర్స్ స్ట్రీమ్) పరీక్షలు రాసింది. ఫలితాలు విడుదలయ్యాక మార్కులు చూసుకున్న అవని తీవ్ర నిరాశకు గురైంది. ఆమెకు అకౌంటెన్సీ, ఎకనామిక్స్ మరియు మ్యాథ్స్ సబ్జెక్టుల్లో 100కి 100 మార్కులు వచ్చాయి. కానీ, తను ఎంతో బాగా రాశానని నమ్మకమున్న ఇంగ్లీష్ సబ్జెక్టులో 19 మార్కులు, బిజినెస్ స్టడీస్లో 5 మార్కులు తగ్గాయి. టాపర్ కావాల్సిన తనకు కేవలం 476 మార్కులు మాత్రమే రావడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.

నమ్మకంతో ముందడుగు.. పెరిగిన 24 మార్కులు!
బోర్డు మూల్యాంకనంపై నమ్మకం లేని అవని.. తన కష్టంపై నమ్మకంతో ధైర్యంగా రీవాల్యుయేషన్ (పునర్ మూల్యాంకనం) కోసం దరఖాస్తు చేసుకుంది. సాధారణంగా రీవాల్యుయేషన్ (CBSE Re-evaluation) లో ఒకటి లేదా రెండు మార్కులు పెరగడం చూస్తుంటాం. కానీ, బోర్డు అధికారులు అవని పేపర్లు మళ్లీ పరిశీలించగా షాకింగ్ నిజం బయటపడింది. ఎగ్జామినర్ల తప్పుల వల్ల ఇంగ్లీష్ మరియు బిజినెస్ స్టడీస్ సబ్జెక్టుల్లో కలిపి ఆమెకు ఏకంగా 24 మార్కులు పెరిగాయి.
500/500 మార్కులతో ఆల్ ఇండియా టాపర్!
రీవాల్యుయేషన్ ఫలితాల తర్వాత అవని కేజ్రీవాల్ స్కోరు 476 నుండి ఏకంగా 500/500 మార్కులకు చేరింది. దీనితో ఆమె దేశంలోనే వంద శాతం మార్కులు సాధించిన ఆల్ ఇండియా టాపర్ల సరసన నిలిచింది.
View this post on Instagram
విజయంపై అవని స్పందిస్తూ:
“తొలుత మార్కులు తగ్గినప్పుడు చాలా బాధపడ్డాను, డిప్రెషన్(Depression)లోకి వెళ్లాను. కానీ నా ప్రిపరేషన్పై, నేను రాసిన సమాధానాలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే రీవాల్యుయేషన్ (re-valuation)కు వెళ్లాను. ఇప్పుడు 500 మార్కులు రావడం నా శ్రమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను” అని సంతోషం వ్యక్తం చేసింది.
విద్యార్థులకు బోర్డుల మూల్యాంకనం ఒక హెచ్చరిక!
ఈ ఘటన కేవలం అవని సంతోషానికే పరిమితం కాలేదు, సీబీఎస్ఈ(CBSE )వంటి ప్రతిష్టాత్మక బోర్డుల మూల్యాంకన విధానంపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఎగ్జామినర్ల నిర్లక్ష్యం వల్ల టాపర్ల భవిష్యత్తు ఎలా దెబ్బతింటుందో దీని ద్వారా స్పష్టమైంది. బోర్డు ఎగ్జామ్స్(Board Exams) రాసే విద్యార్థులు తమ మార్కులపై ఖచ్చితమైన నమ్మకం ఉంటే, ఎలాంటి సంకోచం లేకుండా రీవాల్యుయేషన్కు వెళ్లడం మంచిదని ఈ ఘటన నిరూపిస్తోంది.
After scoring 99 marks in 12th CBSE Boards, I also wanted to go for re-valuation. Paper really went well. 😛
However, I feared what if they deducted my marks. Or, maybe 99 was a typo for 66 anyway.
Lalach buri bhala hai soch kar himmat na hui.
Sorry for flex, if any! :/ https://t.co/cu0nonSgro pic.twitter.com/wnK7hvoefB
— W (@sone_do_mujhe) June 22, 2026
Also Read: Memory Loss: మతిమరుపా? ఈ 4 ప్రమాదకరమైన రోగాలు కావచ్చు!
