Breakfast: ప్రతి రోజూ మనం వివిధ రకాల అల్పాహారాలు తీసుకుంటుంటాం. కొందరు ఇడ్లీలు తింటే, మరికొందరు దోశ, పూరీ, ఉప్మా వంటి వంటకాలను ఇష్టపడుతుంటారు. అయితే సాధారణంగా ఎక్కువ మంది ఎంచుకునే అల్పాహారం ఇడ్లీ అని చెప్పొచ్చు. దక్షిణ భారత దేశ ప్రజలకు ఇడ్లీ ముఖ్యమైన బ్రేక్ఫాస్ట్గా గుర్తింపు పొందింది. బియ్యం, మినప్పప్పుతో సాధారణంగా ఇడ్లీలను తయారు చేస్తారు. అవసరాన్ని బట్టి ఇతర పదార్థాలను కూడా కలుపుతారు.
ఇడ్లీలు నూనె లేకుండా ఆవిరిపై వండబడతాయి. అందువల్ల ఇవి తేలికగా జీర్ణమవుతాయి. చిన్నపిల్లలు, వృద్ధులు కూడా సులభంగా తినగలిగే ఆహారం ఇది. ప్రయాణాల్లో కూడా ఇడ్లీలు సౌకర్యవంతమైన ఎంపికగా ఉంటాయి. అందుకే వైద్యులు కూడా జ్వరం వంటి సమస్యల సమయంలో ఇడ్లీ తినమని సూచిస్తారు.
ఇడ్లీ పిండిని రాత్రంతా పులియబెట్టడం వల్ల దానిలో పోషక విలువలు పెరుగుతాయి. పులియడం ద్వారా సాధారణ కార్బోహైడ్రేట్లు సంక్లిష్ట కార్బోహైడ్రేట్లుగా మారి శరీరానికి మేలు చేస్తాయి. మినప్పప్పు వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందుతాయి. ఇవి శక్తిని పెంచి ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. అలసట, నీరసం తగ్గుతాయి. శరీర శక్తి స్థాయిలు మెరుగుపడతాయి.
ఇడ్లీలలో గ్లూటెన్ ఉండదు. గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవారు కూడా భయపడకుండా వీటిని తినవచ్చు. జీర్ణ సమస్యలు ఉన్నవారికి కూడా ఇవి మంచివి. ఇడ్లీలు ప్రోబయోటిక్ లక్షణాలు కలిగి ఉంటాయి. పులియబెట్టిన పిండిలో మంచి బ్యాక్టీరియా పెరుగుతాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
ఒక ఇడ్లీ ద్వారా సుమారు 40 నుంచి 50 క్యాలరీలు లభిస్తాయి. కొవ్వు తక్కువగా ఉండటంతో బరువు తగ్గాలని భావించే వారికి ఇది మంచి ఆహారం. ఇడ్లీల గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా తక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా బియ్యం బదులు చిరుధాన్యాలతో (మిల్లెట్స్) ఇడ్లీలు తయారు చేస్తే మరింత పోషకాలు లభిస్తాయి. బి-విటమిన్లు అధికంగా అందుతాయి. డయాబెటిస్ ఉన్నవారు మిల్లెట్ ఇడ్లీలు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుంది.
అయితే ప్రస్తుతం మార్కెట్లో లభించే రెడీమేడ్ ఇడ్లీ పిండిని ఉపయోగించే ముందు జాగ్రత్తగా ఉండాలి. అందులో ఏ పదార్థాలు కలుపుతారో తెలియకపోవచ్చు. ఇంట్లో సహజంగా తయారు చేసిన పిండితో ఇడ్లీలు చేసుకోవడం ఉత్తమం. కొందరికి పులిసిన ఆహారం తిన్న
