Su-30 MKI: అస్సాం రాష్ట్రంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో గురువారం సాయంత్రం ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ Su-30MKI యుద్ధవిమానం ప్రమాదానికి గురై కూలిపోయింది. ఈ ఘటన చోకిహోలా ప్రాంతం సమీపంలో సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో జరిగినట్లు నరేంగిలోని రక్షణ శాఖ ప్రజా సంబంధాల అధికారి (PRO) అధికారికంగా వెల్లడించారు.
సమాచారం ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఫైటర్ జెట్లో ఉన్న పైలట్లో ఒకరు కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే రక్షణ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి ప్రత్యేక సెర్చ్ టీమ్లను పంపించి గాలింపు చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం ఆ పైలట్ కోసం తీవ్రంగా వెతుకులాట కొనసాగుతోంది.
ఈ ప్రమాదానికి అసలు కారణం ఏమిటి అనే అంశంపై కూడా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. యుద్ధవిమానం కూలిపోవడానికి సాంకేతిక లోపమా లేదా ఇతర కారణాలా అన్న విషయాలను తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలు పరిశీలనలు చేపడుతున్నాయి.
ఘటన జరిగిన ప్రాంతం అడవులతో నిండిన ప్రాంతం కావడంతో రక్షణ బృందాలు జాగ్రత్తగా గాలింపు చర్యలు నిర్వహిస్తున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Su-30 MKI: కూలిన సుఖోయ్ ఫైటర్ జెట్.. పైలట్లు స్పాట్ డెడ్