Telangana: కొత్త గవర్నర్గా నియమితులైన శివప్రతాప్ శుక్లా రాజకీయ రంగంలో విశేష అనుభవం కలిగిన నేతగా గుర్తింపు పొందారు. ఆయన 1952 ఏప్రిల్ 1న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్ జిల్లా రుద్రాపుర్ గ్రామంలో జన్మించారు. చిన్ననాటి విద్యను రుద్రాపుర్లోనే పూర్తి చేసుకున్న ఆయన, తర్వాత గోరఖ్పూర్లో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి న్యాయవిద్యను అభ్యసించారు.
విద్యార్థి దశలోనే ఆయనకు సామాజిక, రాజకీయ కార్యకలాపాలపై ఆసక్తి పెరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో సంస్థాగత కార్యదర్శిగా పనిచేస్తూ తన ప్రజాసేవా ప్రయాణాన్ని ప్రారంభించారు. అనంతరం 1983లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు.
1989లో గోరఖ్పూర్ నగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 1991లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఈ సమయంలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంలో విద్యాశాఖ సహాయమంత్రిగా స్వతంత్ర హోదాలో బాధ్యతలు నిర్వహించారు.
తరువాత జరిగిన 1993, 1996 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచి వరుసగా ఎమ్మెల్యేగా కొనసాగారు. 1996లో కల్యాణ్సింగ్, రామ్ప్రకాశ్ గుప్తా, రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రులుగా ఉన్న ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసి పరిపాలనా అనుభవాన్ని సంపాదించారు.
2016లో ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన శివప్రతాప్ శుక్లా, 2017లో కేంద్ర ప్రభుత్వంలో ఆర్థికశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2023 ఫిబ్రవరిలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితులై ప్రస్తుతం ఆ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆయనకు రాజకీయ, పరిపాలనా రంగాల్లో ఉన్న అనుభవం వల్ల గవర్నర్గా కీలక పాత్ర పోషించగలరని విశ్లేషకులు భావిస్తున్నారు.
Telangana: తెలంగాణ కొత్త గవర్నర్ ఈయనే