Petrol Prices: ప్రపంచంలోని చాలా దేశాలు తమ చమురు అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడుతున్నాయి. అయితే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అక్కడి నుంచి చమురు సరఫరా దెబ్బతింది. దీంతో భారత్తో పాటు అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత పరిస్థితి ఏర్పడింది.
దిగుమతులు తగ్గిపోవడంతో ఇంధనానికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంక్ల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇంధనం అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రత్యేకంగా తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అంబర్పేట్, నాగోల్, ఉప్పల్, బోడుప్పల్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ బంక్ల ముందు ఆటోలు, వాహనాలు భారీగా క్యూ కడుతున్నాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రస్తుత పరిస్థితిని స్పష్టంగా చూపిస్తున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్ బంక్ల ముందు క్యూ కట్టిన ఆటోలు
పెట్రోల్, డీజిల్ కొరత దృష్ట్యా పెట్రోల్ బంక్లకు పోటెత్తిన వాహనదారులు
అంబర్ పేట్, నాగోల్, ఉప్పల్, బోడుప్పల్ ప్రాంతాల్లో పెట్రోల్ బంక్ల దగ్గర భారీగా క్యూ కట్టిన ఆటోలు
పలు పెట్రోల్ బంక్లలో నో స్టాక్ బోర్డులు దర్శనం pic.twitter.com/xsV04VEYR0
— Telugu Scribe (@TeluguScribe) March 24, 2026
