Telangana: నిజామాబాద్ లో రౌడీషీటర్ రియాజ్ ఎన్ కౌంటర్ సంచలనం రేపింది. దీంతో అతడి అంత్యక్రియలు గోప్యంగా ముగించినట్లు తెలుస్తోంది. ఆత్మరక్షణ కోసం నిన్న రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల వరకు మెజిస్ట్రేట్ సమక్షంలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా బోధన్ రోడ్డులోని శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేసినట్లు సమాచారం.
Telangana: గోప్యంగా రియాజ్ అంత్యక్రియలు!
