Crime: దారుణం.. ప్రియుడి కోసం కూతురిని హత్య చేసిన కసాయి తల్లి

mother killed her daughter for her boyfriend at Bhupalapally dist

mother killed her daughter for her boyfriend at Bhupalapally dist

Crime: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వడితల గ్రామంలో చోటుచేసుకున్న ఒక భయానక ఘటన స్థానికులను కలచివేసింది. కవిత అనే మహిళ తన వివాహేతర సంబంధం కారణంగా జరిగిన ఘోర హత్యలు చివరికి వెలుగులోకి వచ్చాయి.

వివరాల్లోకి వెళ్తే – కవితకు కొంతకాలంగా ఒక వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగుతోందట. ఈ విషయం బయటపడుతుందేమోనని భయపడిన ఆమె, మొదట తన భర్తను అడ్డంకిగా భావించింది. అందుకే 2024 జూన్ 25న అతన్ని ప్రణాళికబద్ధంగా హత్య చేసింది. ఆ తర్వాత అతను వ్యాధితో మృతిచెందినట్లుగా అందర్నీ నమ్మించింది.

ఇంతటితో ఆగకుండా, తన రహస్య బంధం గురించి కూతురు వర్షిణి (22)కి తెలిసిపోయిందని గ్రహించింది. కూతురు ఎవరితోనైనా చెప్పేస్తే తన జీవితం నాశనం అవుతుందని అనుమానం పెంచుకున్న కవిత, తన ప్రియుడితో కలిసి మరో దారుణానికి పాల్పడింది. వర్షిణిని కూడా హత్య చేసి, శవాన్ని భూపాలపల్లి – కాటారం హైవే సమీపంలోని అడవిలో పడేశారు.

అక్కడే నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లి, ఆధార్ కార్డు ఉంచి దానిని నరబలి చేసినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి అనుమానాస్పద విషయాలు గమనించారు. లోతుగా విచారణ జరపడంతో కవిత అసలు నిజాలను ఒప్పుకుంది.

చివరికి, ఈ దారుణ ఘటన వెనుక కవిత, ఆమె ప్రియుడి హత్యా కుట్ర బయటపడింది. ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనతో వడితల గ్రామం మొత్తంలో తీవ్ర కలకలం రేగింది. తల్లి చేతికే కూతురు బలయ్యిందన్న విషయం అందరినీ షాక్‌కు గురి చేసింది. కుటుంబ బంధాలను, మానవ సంబంధాలను మర్చిపోయేంతగా ఒక అక్రమ సంబంధం ఎంత దారుణానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది. ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతుండగా, స్థానికులు కవిత నేరాన్ని ఖండిస్తూ కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: SSMB 29: పెద్ద ప్లానే.. పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డే టార్గెట్.. ఏకంగా 120 దేశాల్లో రిలీజ్

Crime: దారుణం.. ప్రియుడి కోసం కూతురిని హత్య చేసిన కసాయి తల్లి