- తిరుపతి జిల్లా రేణిగుంట ఇండస్ట్రీయల్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం..
- మునోత్ గ్రూప్ లిథియం సెల్ యూనిట్లో షార్ట్ సర్క్యూట్..
- బ్యాటరీలు, యంత్రాలు, ముడి పదార్థాలు అగ్నికి ఆహుతి..
- రూ.70–80 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా..
- మంటలను అదుపులోకి తీసుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది..
తిరుపతి జిల్లా రేణిగుంట ఎయిర్పోర్ట్ సమీపంలో అర్ధరాత్రి సుమారు 2.30 గంటలకు మోనిత్ బ్యాటరీ కంపెనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు 10 ఫైర్ ఇంజన్లను రంగంలోకి దించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
