Amazon Fine: కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (CCPA) అమెజాన్కు రూ.1 లక్ష జరిమానా(Amazon Fine) విధించింది. తమ ప్లాట్ఫామ్పై “శ్రీ రామ్ మందిర్ అయోధ్య ప్రసాద్” పేరుతో తప్పుదోవ పట్టించే మిఠాయిల ప్రకటనలు, జాబితాలను అనుమతించినందుకు ఈ చర్య తీసుకుంది. ఈ మిఠాయిలకు శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి ఎలాంటి అధికారిక అనుమతి లేదని CCPA గుర్తించింది.
రామ మందిరంలో సమర్పించి, ఆశీర్వదించిన పవిత్ర ఆహారాన్ని సూచించే “శ్రీ రామ్ మందిర్ అయోధ్య ప్రసాద్” అనే పదాన్ని సాధారణ మిఠాయిలకు వాణిజ్యపరంగా ఉపయోగించడం తప్పుదోవ పట్టించే చర్యగా CCPA పేర్కొంది. ఇది వినియోగదారుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని తెలిపింది.

ఈ వ్యవహారంపై 2024 జనవరిలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ఫిర్యాదు చేసింది. రామ మందిరం లేదా సంబంధిత ట్రస్ట్ నుంచి ఎలాంటి అనుమతి, అనుబంధం, ఆమోదం లేకుండానే అసలైన ప్రసాదమనే భావన కలిగించేలా అమెజాన్లో మిఠాయిలను విక్రయిస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు.
Also Read: HDFC Bank: ఇదేంది భయ్యా.. 46 పైసలు బిల్లు కట్టలేదని రూ.1,200 ఫైన్!
బీహార్ బ్రదర్స్ బ్రాండ్ పేరుతో చందు ట్రేడింగ్ కంపెనీ లిస్ట్ చేసిన నాలుగు ఉత్పత్తులను CCPA గుర్తించింది. ఇందులో నెయ్యి లడ్డు, ఖోయా లడ్డు, నెయ్యి బూందీ లడ్డు, దేశీ ఆవు పాల పేడా ఉన్నాయి. వీటి ధరలు రూ.299 నుంచి రూ.385 వరకు ఉన్నాయి. లిస్టింగ్లలో శ్రీరాముడు, అయోధ్యకు సంబంధించిన మతపరమైన చిత్రాలు, “రామ మందిర ప్రసాద్” వంటి పదాలను ఉపయోగించారు.
జనవరి 19, 2024న CCPA షోకాజ్ నోటీసు జారీ చేసిన తర్వాత అమెజాన్ ఆ లిస్టింగ్లను తొలగించింది. అలాగే, వాటిని లిస్ట్ చేసిన థర్డ్పార్టీ విక్రేత వివరాలను వెల్లడించింది. తాము కేవలం మార్కెట్ప్లేస్ మధ్యవర్తులమని, ఉత్పత్తుల లిస్టింగ్, ధర నిర్ణయం, వివరాలు ఇవ్వడం విక్రేతల బాధ్యత అని అమెజాన్ వాదించింది.
Also Read: Telangana Folk: రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఫేమస్ ఫోక్ ఆర్టిస్టులు
