Viral: మధ్యప్రదేశ్లోని భోపాల్ ఫ్యామిలీ కోర్టులో ఇటీవల ఒక ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. పౌరోహిత్యం చేసే యువకుడిని పెళ్లి చేసుకున్న మహిళ ప్రస్తుతం పోలీసులు విభాగంలో SIగా పనిచేస్తోంది. పెళ్లి తర్వాత భార్య చదువుకుని ఉద్యోగం పొందాలన్న ఆశతో భర్త పక్కాగా ఆదుకుని, ఆర్థికంగా–మానసికంగా సహాయం చేశాడు. చివరికి ఆమె SI పోస్టు సాధించడంలో భర్త ప్రోత్సాహం ప్రముఖ పాత్ర పోషించింది.
కానీ ఉద్యోగం వచ్చిన కొద్దికాలానికే ఆమె కోర్టును ఆశ్రయించి విడాకులు కోరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. విడాకుల కారణాలను వివరించేటప్పుడు, భర్త ధోతీ–కుర్తా ధరించడం, పిలక పెట్టుకోవడం తన హోదాకు అసౌకర్యం కలిగిస్తుందని, ఆ దుస్తులు సమాజంలో తనకు అవమానంగా అనిపిస్తున్నాయని పేర్కొంది. భర్త పౌరోహిత్యం చేయడం కూడా తనకు తగదని చెప్పినట్లు సమాచారం.
ఈ వివాహ బంధాన్ని కాపాడేందుకు కోర్టు కౌన్సెలింగ్కు కూడా పంపించింది. ఇరువురితో మాట్లాడి పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేసినా, భార్య తన అభిప్రాయంలో మార్పు చూపించలేదని కౌన్సెలర్లు తెలిపారు. భర్త మాత్రం విడాకులకు ఒప్పుకోకపోయినా, భార్య మాత్రం తన నిర్ణయంపై ఆగకుండా నిలబడి ఉంది. విషయం ఇంకా కోర్టు పరిధిలోనే కొనసాగుతోంది.
