Rehan Vadra: కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా కుమారుడు రెహన్ వాద్రా నిశ్చితార్థం వార్తలతో ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. రెహన్ తన స్నేహితురాలు అవివా బేగ్తో నిశ్చితార్థం చేసుకున్నారు. వీరిద్దరూ దాదాపు ఏడు సంవత్సరాలుగా ప్రేమలో ఉండగా, కుటుంబాల సమ్మతితో ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు.
అవివా బేగ్ వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్, నిర్మాత, వ్యాపారవేత్త. ఆమె తల్లి నందితా బేగ్, ప్రియాంక గాంధీ వాద్రాకు మంచి స్నేహితురాలు. మీడియా కథనాల ప్రకారం, కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం అయిన ఇందిరా భవన్ ఇంటీరియర్ డిజైన్ పనుల్లో నందితా బేగ్ సహకారం అందించారు. ఈ కారణంగా రెండు కుటుంబాల మధ్య ఇప్పటికే మంచి పరిచయం, సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఇప్పుడు ఆ స్నేహం వివాహ బంధంగా మారబోతోంది.
అవివా తండ్రి ఇమ్రాన్ బేగ్ ఒక వ్యాపారవేత్త కాగా, ఆమె తల్లి నందితా బేగ్ ఢిల్లీకి చెందిన ప్రఖ్యాత ఇంటీరియర్ డిజైనర్. ప్రియాంక గాంధీ – నందితా బేగ్ చాలా సంవత్సరాలుగా ఒకరినొకరు తెలుసుకునే స్నేహితులని సమాచారం. కాంగ్రెస్ కార్యాలయ ఇంటీరియర్ డిజైన్లో నందితా పాత్ర ఉండటం వల్ల కుటుంబాల మధ్య అనుబంధం మరింత బలపడింది.
నందితా బేగ్ ఢిల్లీకి చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్తో పాటు సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు. ఆమె ది కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్లో విద్యాభ్యాసం చేసి, తర్వాత ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె ‘RAIN డిజైన్’ అనే స్వంత సంస్థను నిర్వహిస్తూ, నివాస మరియు వాణిజ్య ఇంటీరియర్ డిజైన్లపై పనిచేస్తున్నారు.
ఇక రెహన్, అవివా దాదాపు ఏడు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ఇటీవల రెహన్ అవివాకు ప్రపోజ్ చేయగా, రెండు కుటుంబాలు కూడా వివాహానికి అంగీకరించడంతో నిశ్చితార్థం జరిగింది. రెహన్ వాద్రాతో నిశ్చితార్థం తర్వాత అవివా బేగ్ ప్రజల దృష్టిని ఆకర్షించినప్పటికీ, ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా గోప్యంగానే ఉంచుతుంది.
లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, అవివా ఢిల్లీకి చెందిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. ఆమె సమకాలీన, కళాత్మక దృశ్య కథనాలకు మంచి గుర్తింపు పొందింది. ఢిల్లీలోని మోడరన్ స్కూల్లో చదివిన అవివా, OP జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి మీడియా కమ్యూనికేషన్, జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేశారు. ఫోటోగ్రఫీ, ప్రొడక్షన్తో పాటు ‘అటెలియర్ 11’ అనే సంస్థకు సహ-వ్యవస్థాపకురాలిగా కూడా కొనసాగుతున్నారు.
అటెలియర్ 11 ద్వారా అవివా దృశ్య కళలు, బ్రాండింగ్ రంగంలో తనదైన ముద్ర వేసుకుంది. ఆమె కళాత్మక పనులు అనేక ప్రతిష్టాత్మక ప్రదర్శనల్లో చోటు దక్కించుకున్నాయి. 2023లో యువ కళాకారులను ప్రోత్సహించే ప్రతిష్టాత్మక వేదిక అయిన ఇండియా ఆర్ట్ ఫెయిర్లోని ‘యంగ్ కలెక్టర్స్ ప్రోగ్రామ్’లో కూడా ఆమెకు అవకాశం లభించింది.
