Drishyam: దృశ్యం సినిమా చూసి.. లవర్ తో కలిసి భర్తను చంపిన భార్య

Inspired by Drishyam, Wife Plots Husband’s Murder with Lover in Gurugram; Daughter’s Revelation Exposed Affair

Inspired by Drishyam, Wife Plots Husband’s Murder with Lover in Gurugram; Daughter’s Revelation Exposed Affair

Drishyam: విక్రమ్ ఎప్పటిలాగే జూలై 26న కంపెనీకి వెళ్లాడు. కానీ ఆ రోజు తిరిగి ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు జూలై 28న పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

విక్రమ్ ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, అతని భార్య సోనీని విచారించారు. ఈ సందర్భంగా, విక్రమ్ స్నేహితుడు రవీందర్ ఏదో చేసి ఉండొచ్చని సోనీ అనుమానం వ్యక్తం చేసింది. దాంతో, పోలీసులు రవీందర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, సంచలన విషయాలు బయటపడ్డాయి.

విచారణలో, రవీందర్-సోనీకి వివాహేతర సంబంధం ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. తమ బంధం గురించి విక్రమ్‌కి తెలిసిపోయినందున, అతడిని చంపాలని సోనీ కోరిందని రవీందర్ ఒప్పుకున్నాడు. అంతేకాక, హత్యకు ముందు సోనీతో కలిసి దృశ్యం సినిమా, అలాగే ఒక క్రైమ్ సీరియల్‌లోని అనేక ఎపిసోడ్‌లు చూసినట్లు కూడా వెల్లడించాడు.

రవీందర్ చెప్పిన ప్రకారం, జూలై 26న తన ముగ్గురు స్నేహితులు — ఫరియాద్, మనీష్, మరో వ్యక్తితో కలిసి పథకం ప్రకారం విక్రమ్‌ను గొంతు కోసి హత్య చేశారు. తరువాత, గురుగ్రామ్‌లోని మొహమ్మద్‌పూర్ గ్రామం దగ్గర ఈవిల్ సొసైటీ సమీపంలోని ఒక గొయ్యిలో మృతదేహాన్ని పాతిపెట్టారు.

విక్రమ్ హత్య జరిగినప్పటి నుండి మృతదేహాన్ని ఖననం చేసే వరకు సోనీ తన ప్రేమికుడు రవీందర్‌తో నిరంతరం ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. చివరికి, ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు.

Also Read: Web Series: వెబ్ సిరీస్ చూసి.. ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల బాలుడు

Drishyam: దృశ్యం సినిమా చూసి.. లవర్ తో కలిసి భర్తను చంపిన భార్య