Telangana: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఇందుకు ముందుగా, ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లో ఉన్న ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. రాష్ట్రంలో కోటి మహిళలకు ఈ చీరలు అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Telangana: ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించిన సీఎం రేవంత్
Telangana: CM Revanth starts distribution of Indiramma sarees
