Srikakulam Stampede: రెయిలింగ్ ఊడటంతోనే ప్రమాదం: హోంమంత్రి అనిత

Srikakulam Temple Stampede is caused by the railing being blown off: Home Minister Anitha

Srikakulam Temple Stampede is caused by the railing being blown off: Home Minister Anitha

 Srikakulam Stampede: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. ఈ దుర్ఘటనలో గాయపడిన భక్తులకు వెంటనే ఉత్తమ వైద్యాన్ని అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. సాధారణంగా ఈ ఆలయానికి ప్రతి వారం సుమారు 1,500 నుంచి 2,000 మంది వరకు భక్తులు దర్శనార్థం వస్తారని వివరించారు.

ఆలయం మొదటి అంతస్తులో ఉండడంతో భక్తులు సుమారు 20 మెట్లు ఎక్కి పైకి వెళ్తారని చెప్పారు. ఈ క్రమంలో పై అంతస్తులో ఉన్న రెయిలింగ్ ఒక్కసారిగా ఊడిపోవడంతో ఒకరిపై ఒకరు పడిపోవడం, అదేసమయంలో భక్తుల రద్దీ పెరగడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు అనిత వివరించారు. ఈ ఘటనలో భయాందోళనలు నెలకొన్నాయని ఆమె చెప్పి, భవిష్యత్తులో ఇలా జరగకుండా అన్ని భద్రతా చర్యలను కచ్చితంగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు.

ఇదే ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడినవారికి రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటన రాష్ట్రాన్ని కలచివేయడంతో, ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్ష జరుగుతోంది.

Also Read: Srikakulam: తొక్కిసలాట జరిగింది ఈ ఆలయంలోనే

 Srikakulam Stampede: రెయిలింగ్ ఊడటంతోనే ప్రమాదం: హోంమంత్రి అనిత