Curry Puff:మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని ఓ బేకరీలో కర్రీ పఫ్లో చనిపోయిన పాముపిల్ల కనిపించిన ఘటన మంగళవారం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని సీఐ కమలాకర్ వివరించారు.
జౌఖీ నగర్కు చెందిన శ్రీశైల తన పిల్లలను పాఠశాల నుంచి ఇంటికి తీసుకువెళ్తూ, ఠాణా సమీపంలోని ఓ బేకరీలో ఆగి ఎగ్ పఫ్, కర్రీ పఫ్ కొనుగోలు చేశారు. పిల్లలు ఎగ్ పఫ్ను బేకరీ వద్దే తిన్నారు. ఇంటికి చేరిన తర్వాత మహిళ కర్రీ పఫ్ తినేందుకు సిద్ధమవుతుండగా, అందులో చనిపోయిన పాముపిల్ల కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు.
వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న సీఐ కమలాకర్ బేకరీని సందర్శించి విచారణ చేపట్టారు. ఈ విషయాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్కు తెలియజేశామని, వారి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో జడ్చర్లలో చర్చనీయాంశంగా మారింది.
Medaram: తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర సందడి మొదలైంది. వనదేవతల దర్శనానికి వేలాది భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. భక్తులు తమ మొక్కుల పరంగా ఎత్తుబంగారాన్ని సమర్పిస్తున్నారు.…
Autism : ఆటిజం వంటి ప్రత్యేక అవసరాలు ఉన్న కుటుంబ సభ్యులతో వ్యవహరించడం చాలా మందికి సవాలుగా మారింది. హైదరాబాద్కు చెందిన ఒక యువ పారిశ్రామికవేత్త ప్రజలకు…