Crime: రెండో భార్యను చంపి.. ఫస్ట్ భార్యకు ఫొటోలు సెండ్ చేసి..

Killed second wife.. and sent photos to first wife.. at Chevella

Killed second wife.. and sent photos to first wife.. at Chevella

Crime: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం వెంకన్నగూడ గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భార్యను భర్త మద్యం మత్తులో హత్య చేసిన సంఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. వివరాల్లోకి వెళితే — వెంకన్నగూడకు చెందిన వానరాశి జంగయ్య హైదరాబాదులో డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యతో జీవిస్తున్న సమయంలోనే, సుమారు 15 సంవత్సరాల క్రితం రజిత అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.

జంగయ్య మరియు రజిత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, అనేక విభేదాల నేపథ్యంలో రజిత మూడు సంవత్సరాల క్రితం అతనిని విడిచి వెళ్లిపోయింది. ఈమధ్య జంగయ్య, రజిత ఆచూకీ తెలుసుకుని, ఆమెను తిరిగి గ్రామానికి తీసుకువచ్చాడు. మంగళవారం ఉదయం గ్రామ పెద్దల సమక్షంలో ఇరువురూ మాట్లాడుకున్నారు. జంగయ్య తిరిగి కలిసిపోవాలని కోరగా, రజిత స్పష్టంగా నిరాకరించింది.

అయితే రజిత అంగీకరించకపోవడంతో జంగయ్య తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు. మద్యం మత్తులో ఆమె మెడకు చున్నీతో బిగించి ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఆ తర్వాత చావలేదని అనుమానించి, అక్కడే ఉన్న సిమెంట్ రాయితో రజిత ఛాతీపై బలంగా కొట్టాడు. మరణం ధృవమైన తర్వాత, మృతదేహ ఫోటోలు తీసి తన మొదటి భార్యకు పంపించి “ఇలా చంపాను” అని తెలిపాడు. అనంతరం గ్రామ సర్పంచ్ నర్సింలుకు సమాచారం ఇచ్చి, తానే స్వయంగా చేవెళ్ల పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. రజిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read: Hyderabad: లిఫ్ట్‌ లేకుండానే తెరుచుకున్న డోర్‌.. స్పాట్ లోనే డెడ్

Crime: రెండో భార్యను చంపి.. ఫస్ట్ భార్యకు ఫొటోలు సెండ్ చేసి..