Telangana: పాడి కౌశిక్ రెడ్డిపై మరోమారు కేసు నమోదు

Case registered against BRS MLA Padi Kaushik Reddy

Case registered against BRS MLA Padi Kaushik Reddy

Telangana: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills Bye Election) నిన్న ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఎన్నికల సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే, కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణలు జరిగినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లు పోలీసులు తెలిపారు. ఆయనపై మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

పోలీసుల ప్రకారం, కౌశిక్‌రెడ్డి నిన్న యూసఫ్‌గూడ పోలింగ్ కేంద్రాల వద్ద హల్‌చల్ చేసినట్లు తెలిపారు. ఆయన తన అనుచరులతో కలిసి మహ్మద్ ఫంక్షన్ హాల్‌లోకి చొచ్చుకెళ్లారని, అడ్డుకున్నా వినకపోవడంతో ఉద్రిక్తత నెలకొన్నట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత సృష్టించే ప్రయత్నం చేశారనే ఆరోపణలపై ఆయనపై ట్రెస్‌పాస్, న్యూసెన్స్ కేసులు నమోదు చేసినట్లు మధురానగర్ పోలీసులు వెల్లడించారు.

Also Read: Konda Surekha: హీరో నాగార్జున ఫ్యామిలీపై కామెంట్స్.. కొండా సురేఖ ట్వీట్

Telangana: పాడి కౌశిక్ రెడ్డిపై మరోమారు కేసు నమోదు