Business, Special

One Rupee Coin : రూపాయి నాణెం ముద్రణకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందంటే..

How much does the Govt spend to mint One-Rupee coin? Check here

Image Source : PIXABAY

One Rupee Coin : ఒక రూపాయి నాణెం పెద్దగా ద్రవ్య ప్రాముఖ్యతను కలిగి ఉండకపోవచ్చు. కానీ ఇది భారతీయ గృహాలలో గణనీయమైన సెంటిమెంట్ విలువను కలిగి ఉంటుంది. అయితే, ఒక రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చు అవుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా. అది దాని విలువ కంటే ఎక్కువ! ఒక RTI అభ్యర్థనకు ప్రతిస్పందిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఒక రూపాయి నాణెం తయారీకి సగటు ధర రూ. 1.11 అని వెల్లడించింది. ఇది దాని స్వంత విలువ కంటే ఎక్కువ.

1922 నుండి చెలామణిలో ఉన్న ఒక రూపాయి నాణెం స్టెయిన్‌లెస్ స్టీల్‌తో రూపొందించింది. 21.93 మిమీ వ్యాసం, 1.45 మిమీ మందం, 3.76 గ్రాముల బరువు ఉంటుంది. 2018లో గణనీయంగా నాణేల ముద్రణ జరిగినట్లు ఆర్టీఐ ద్వారా తేలింది. 2015 నుంచి 2016 మధ్య కాలంలో అత్యధికంగా 2151 మిలియన్ నాణేలు వచ్చినట్లు వెల్లడైంది.

గతేడాదితో పోల్చితే, ఈ ఏడాది తయారైన ఒక రూపాయి నాణేల సంఖ్య కూడా 903 మిలియన్ల నుంచి 630 మిలియన్లకు తగ్గింది. ముఖ్యంగా రెండు రూపాయల నాణెం, ఐదు రూపాయల నాణెం, 10 రూపాయల నాణెం తయారీకి చాలా తక్కువ ఖర్చవుతుంది. రూ.2 నాణెం మింట్ ధర రూ.1.28, రూ.5 నాణెం రూ.3.69, రూ.10 నాణెం తయారీకి రూ.5.54 అవుతుంది.

RBI తన పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రెండు కరెన్సీ ప్రెస్‌ల యాజమాన్యాన్ని కలిగి ఉంది. ఈ ప్రెస్‌లు ఒక రూపాయి నోట్లు, నాణేలు మినహా భారతీయ కరెన్సీ నోట్ల ఉత్పత్తికి బాధ్యత వహిస్తాయి. ఒక రూపాయి నాణేలను ముంబై, హైదరాబాద్‌లోని ఇండియన్ గవర్నమెంట్ మింట్ (IGM) ముద్రిస్తుంది.

Also Read : ‘Vande Mataram’: మోదీ సమక్షంలో జాతీయ గీతం పాడిన మిజోరాం చిన్నారి

One Rupee Coin : రూపాయి నాణెం ముద్రణకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందంటే..