Viral: ఫినైల్ తాగి సూసైడ్ కు యత్నించిన 24 మంది హిజ్రాలు

25 Transgenders People Consume 'Phenyl' In Madhya Pradesh, Hospitalised

25 Transgenders People Consume 'Phenyl' In Madhya Pradesh, Hospitalised

Viral: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఒక దారుణ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మొత్తం 24 మంది ట్రాన్స్‌జెండర్లు (హిజ్రాలు) ఫినైల్‌ తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన సంచలనంగా మారింది.

వివరాల ప్రకారం, నిన్న రాత్రి ఇండోర్ నగరంలోని ఒక ఇంట్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. అందరూ ఒకే చోట చేరి బాటిళ్లలో ఉన్న ఫినైల్‌ను సామూహికంగా తాగారు. ఈ ఘటన అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియో ఆధారంగా స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని అందరినీ అత్యవసరంగా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఇటీవల ఇద్దరు వ్యక్తులు జర్నలిస్టులమని చెప్పి ఓ ట్రాన్స్‌జెండర్‌ను అత్యాచారం చేసి, వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో, నిరాశకు గురైన హిజ్రాలు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

తమకు న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌జెండర్ సంఘాల సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇండోర్‌లో జరిగిన ఈ సంఘటన సమాజంలో మానవత్వం ఎక్కడికి చేరిందనే ప్రశ్నను లేవనెత్తుతోంది. హిజ్రాల భద్రత, గౌరవం కోసం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సామాజిక సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.

Also Read: Mobile Phone: మొబైల్ తో బాత్రూమ్ లోకి వెళ్తున్నారా..?

Viral: ఫినైల్ తాగి సూసైడ్ కు యత్నించిన 24 మంది హిజ్రాలు