Inter Exams: తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించబడనున్నాయి. పూర్తి షెడ్యూల్ వివరాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
విద్యాశాఖ ఈసారి సిలబస్లో కూడా కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా, ఫస్ట్ ఇయర్ విద్యార్థులకోసం ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ను ముందే నిర్వహించే విధంగా నిర్ణయించారు. సాధారణంగా ఈ పరీక్షలను రెండవ సంవత్సరం లోపల నిర్వహించేవారు, కానీ కొత్త మార్పుల ప్రకారం, విద్యార్థులు మొదటి సంవత్సరం నుండే ప్రయోగశాలలపై దృష్టి సారించి, పూర్తి స్థాయి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ, రెండు ఏళ్ల తర్వాత ఇంటర్ సిలబస్లో మార్పులు చేస్తున్నట్టు తెలిపారు. NCERT మార్గదర్శకాలు మరియు సబ్జెక్టు కమిటీ సూచనల ప్రకారం ఈ మార్పులు చేయబడ్డాయి. ఈ సవరణలు 40–45 రోజుల్లో పూర్తిచేయబడతాయి.
ఏప్రిల్ చివరి వరకు పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వస్తాయని, పుస్తకాలలో QR కోడ్ లు ఉంటాయని, ల్యాబ్ ప్రాక్టికల్స్ ఇంగ్లీష్తో పాటు ఇతర భాషల్లో కూడా లభిస్తాయని చెప్పారు.
అంతేకాక, 2026 నుండి ACE కొత్త గ్రూప్ ప్రారంభం అవుతుంది. అలాగే, నవంబర్ 1 నుండి ఈ ఎగ్జామ్స్ ఫీజు వసూలు చేయబడుతుందని ఇంటర్ బోర్డు సెక్రటరీ తెలిపారు.
